Thursday 22 December 2011
Saturday 19 November 2011
చీ అమ్మంటేనే నాకు కోపం!!!! (చందమామ ఆవేదన)
చీ అమ్మంటేనే నాకు కోపం!!!!
అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
జాబిల్లి రావే అని ప్రేమగా పిలుస్తుంది
కానీ అన్ని నన్నే తెచ్చుకొమంటుంది.
గోరుముద్దలు ఆశగా చూపెడుతుంది.
ముద్దుగా అద్దంలో బందిస్తుంది.
చక్కగా నీళ్ళలో పడేస్తుంది.
చంకలో నా చిట్టిపాపను మాత్రం లాలిస్తుంది.
తనతో నన్ను ఆశల వలలో ఆడిస్తుంది .
జోల పాటతో చిట్టికి జో కొడుతోంది .
నేను నిద్రించే సమయానికి లేచి వెళ్ళిపోతుంది.
అమ్మా........
ఆకలితో ఆశగా వెళుతున్నాను.
రేపైనా నీ ఒడిలో జో కొడుతూ గోరుముద్దలు తినిపించవా............
అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Labels:
comedy,
నా పిచ్చి ప్రశ్నకు జవాబు చెప్పండి
Saturday 12 November 2011
Tuesday 8 November 2011
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో
నెట్లో ఈ పాటను స్వామి సరస్వతి గారు అప్ లోడ్ చేసారు
ఈ పాట ఎవరు రాసారో ?
ఎవరు పాడారో తెలిస్తే తెలుపగలరు?
అలాగే క్రింది కవిత ఎవరు రాసారో తెలుపగలరు
అమ్మ మనసు
నువ్వు మొదటిసారి గర్భాన కదలినపుడు పరమానందం కలిగింది.
-నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.
-ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.
-నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.
-అందరికంటే బలవంతుడివవ్వాలని!
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.
-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.
-గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.
-నేను లేకపోయినా బ్రతకగలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.
-నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది.
-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!
-నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.
-ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.
-నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.
-అందరికంటే బలవంతుడివవ్వాలని!
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.
-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.
-గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.
-నేను లేకపోయినా బ్రతకగలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.
-నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది.
-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!
Thursday 27 October 2011
నేటి గాంధీ
అప్పుడు
గాంధీ విగ్రహం అది ఒక శాంతి చిహ్నం
గాంధీ విగ్రహం అది ఒక శాంతి చిహ్నం
గాంధీ గేయం అది ఒక సమైక్యత భావం
గాంధీ గ్రంధం అది ఒక మార్గ దర్శకం
బ్రిటిష్ వారి చేతుల్లో కీలుబోమ్మల్లా నలుగు తున్న రోజుల్లో ఎంతో మంది తమ ఉద్రేకానికి ఉద్వేగానికి పని చెప్పి బ్రిటిష్ వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోతుంటే.అలాంటి సమయంలో ఎటువంటి ఆయుధం లేకుండా ఒక బక్క పల్చటి ప్రాణి అహింసా అనే ఆయుధం తో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాడు. పోరాటం అంటే చంపడమో లేదా చావడమో కాదని
సరైన పరిష్కార మార్గం.వెతికి అ మార్గం గుండా పయనించమని ఆ మహనీయుడు చెప్పి చేసి చూపారు.
ఇప్పుడు
గాంధీ ఒక విగ్రహం అది ఒక రాజకీయ పార్టి జెండా ఎగర వేయడానికి ఊతం
గాంధీ ఒక గేయం అది ఒక కాలక్షేపం
గాంధీ ఒక గ్రంధం అది ఒక చరిత్ర
Wednesday 12 October 2011
Tuesday 6 September 2011
Sunday 28 August 2011
వాన పై ఇప్పుడూ కోపమొచ్చింది
నేను ఇంటి దగ్గర ఉన్నాను మద్యాహ్నం 2:00 గంటల సమయం కావచ్చింది. అంతవరకు భానుడు తన ప్రతాపాన్ని చూపి అతను ఇంటికి వెళ్లి పోయాడు తను ఎప్పుడైతే ఇంటికి వెల్లిపోయాడో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు తమ ఇళ్ళకు వచ్చేస్తున్నారు.చల్లని గాలులు వీస్తున్నాయి.చెట్లు పరశించి ఊగుతున్నయ్ పక్రుతినై పుడితే బాగున్నేమోనని అనిపించింది. ఎందుకంటే వాటితో పాటు నేను తడిసి నేను వాటిలా ఆనందంగా గెంతులసేవాడిని వాటికి అమ్మానాన్న బందువులు చుట్టాలు ఎవరూ లేరు అడిగే వాళ్ళే లేరు కాని నాకు ఇంటి దగ్గర తడిస్తే అమ్మ తిడితుంది పొలంలో తడిస్తే నాన్న కొడతాడు ఊర్లో తడిస్తే బందువులు అడ్డుతగిలి అడుగుతారు కానీ ప్రోత్సహించేవారు ఎవరూ లేరు.అందుకే ప్రకృతితో కలిసి అడుకుందామని నెనూ బయటకు వెళ్ళిపోయాను.
ప్రకృతి నన్నుమేళతాళాలతో (ఉరుములు మెరుపులు) ఆహ్వానించింది.చినుకు నా చెంపను ముద్దాడింది. నా ఒళ్ళు పులకరించింది.పుడమి పరవసించిపోయింది.అంతవరకు నాలో ఉన్న భయాల్నివాన కడిగేస్తుంది.మెరిసే మెరుపు మా ఊరుకు ముత్యాల హరంలా కనబడుతుంది ఉరిమేఉరుము మాఊరి బలాన్ని కలసి కట్టు తనాన్ని మరిపిస్తుంది.కురిసే ఆ చల్లనిజల్లు పల్లె ప్రేమానురాగాల్నికురిపిస్తుంది.పంట పొలాలు నాతో పాటుగా ఊగుతున్నాయి.నాకు తెలియకుండానే పొలంలోకి వచ్చేసాను.నాన్న గుర్తొచ్చాడు భయంతో ఇంటికి దారితిసాను.
ఊర్లోకి వచ్చేసాను.మా వీధిలో ఒక అపురూపమైన సన్నివేశం అదే మా కిట్టు గాడి ఇంట్లో వాన.నాకు వానపై కోపం వచ్చింది మా ఇంట్లోకి రాకుండా వాడి ఇంట్లోకి వెళ్లిందని.ఎవరో అన్నట్టు వాళ్ళింటి అడ్రస్ వానకు బాగా తెలుసేమో సరాసరి వాళ్ళ ఇంటిలోకే వెళ్ళిపోయింది.కిట్టు గాడు హాయ్ గా ఇంట్లోనే ఆడుకుంటున్నాడు.వాళ్ళమ్మ చాలా మంచిది ఆడుకోడానికి స్థలం సరిపోవడం లేదని ఇంట్లో ఉన్న వస్తువులు మా డాబా ఇంటిలో పెడుతుంది .వాడుమాత్రం చక్కగా గిన్నెలతోపాత్రలతో ఆడుకుంటున్నాడు.నేను కిట్టు దగ్గరకువెళ్లి కిట్టుతో ఆడుకుందామనుకున్నాను వాడు నావైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు. వాడు నన్ను వెక్కిరింత చేసినట్టు అనిపించింది.అందుకే ఇంటికి వెళ్ళిపోయా ఇంటిదగ్గర అమ్మ నాకోసం ఎదురుచూస్తుంది.
ఇంటికి వెళ్ళగానే అమ్మ నన్ను కొట్టింది.మన ఇంట్లోకి రాని వాన లోనికి నువ్వెందుకు వెళ్ళావని కొట్టి ఉంటుందిలే అనుకున్నాను.అందుకే వాన తగ్గిపోయి ఏకంగా నా కంట్లోకే వచ్చేసింది.నా చెంపను ముద్దాడి నన్ను ఓదార్చింది.అందుకే నేను ఇంకా ఏడవకుండా ఇంట్లోకుర్చోని చదువుకున్నాను. రాత్రి భోజనం చేసి పడుకోబోయే సరికి మళ్ళి వాన మొదలైంది.మా అమ్మ నన్నుఅడ్డుకుంది కాని కిట్టు గాడు ఆడుకుంటున్నాడు.చేసేదేమీ లేక నేను పడుకుండిపోయాను.ఉదయం లేచేసరికి కిట్టు గాడు మా వాకిట్లో పడుకొని ఉన్నాడు వాడికి వాళ్ళమ్మ బుజ్జగిస్తూ ఉంది.అమ్మ వాళ్లకు ఏవో ఇచ్చింది కిట్టు వాళ్ళ అమ్మ అవి తీసుకోని కిట్టు గాడిని తీసుకోని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.
నేను స్నానం చేసి స్కూల్ కి బయలుదేరి వెళ్లి పోయాను.స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరం అడుకుంటున్నాం కిట్టు గుర్తొచ్చాడు వాడు వచ్చి నిన్నటి వాన విషయం అందరితో చెప్పి నన్ను ఎగతాళి చేస్తాడనుకున్న కానీ కిట్టు ఇంకా బడికి రాలేదు.స్కూల్ విడిచి పెట్టేసారు ఆ రోజు కిట్టు స్కూల్ కి రాలేదు. అమ్మయ్య అనుకోని ఇంటికి వచ్చి కిట్టు స్కూల్ కి రాలేదని అమ్మకు చెప్పను. అప్పుడు అమ్మ అవునురా కిట్టు స్కూల్ కి రాలేదు.వాడికి జ్వరం వచ్చింది నిన్నంతా పాపం వానలో తడిసాడుగా అందుకే అని అంది (అమాయకంగా).నేను కోపంగా పాపం అంటా వేమిటి వాడు అడుకుంటేను అన్నాను నేను .దానికి అమ్మ కాదురా వాడు ఆడుకోలేదురా ఇంట్లో ఉన్న కొద్ది సామాన్లు తడవకుండా చూసుకొన్నాడు.కొన్ని మన ఇంట్లో పెట్టారు వాళ్ళది పూరిల్లు వానొస్తే పైకప్పు ఎగిరి పై నుండి లోపలికి నీరు వస్తుంది.వాళ్ళు నిన్నటు నుండి వంట చేసు కోలేదు ఇప్పుడు కొంచెం అన్నం ఇచ్చి వచ్చాను కిట్టు రాత్రంతా తడవడం వలన జలుబు చేసి జ్వరం వచ్చింది అని చెప్పింది.
అమ్మ ఇంట్లోకి వెళ్లి తన పనులు తను చూసుకొంటుంది.నేను పుస్తకాలు ఇంట్లో పెట్టి కిట్టును కలుసుకోడానికని బయటకు వచ్చాను ఇంతలో ఒక పెద్ద మెరుపు హూ ....వానపై ఇప్పుడూ కోపమొచ్చింది అందుకే త్వరగా వెళ్లి కిట్టును మా ఇంటికి తీసుకొచ్చేసాను.కొన్నాళ్ళ తరువాత కిట్టు వాళ్ళ ఇంటి అడ్రెస్స్ (పైకప్పు)మారిపోయింది.ఇప్పుడు వానకు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియదు అందుకే అప్పుడప్పుడు మేమే బయటకు వచ్చి వానను కలుసుకుంటున్నాం.
Sunday 21 August 2011
Sunday 14 August 2011
ప్లీజ్.........అలా చెయ్యొద్దు
నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.
(21-07-2011)సాక్షి పేపర్ (16 వ పేజిలో) |
మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళ పాలన నుండి విడిపించుకోవడానికి మన వారు ఒక నినాదం (సూత్రం) పాటించారు అదే చెయ్యు లేదా చావు (డూ ఆర్ డై ). అంటే నువ్వు పోరాడు అ సాధనలో (పోరాటంలో) చనిపో అంతే కానీ వెనకడుగు వేయకు అని. మరి ఇతను ఏం చేసి చనిపోయాడు. ఏమి లేదు కొంత మాత్రమే చూసి చనిపోయాడు. కొంత మాత్రమే చూసి అని ఎందుకు అన్నానంటే ఆ కొంత అనేది ఈ పోరాటాలు,ఉద్యమాలు,రాష్ట్రాలు,దేశాలు కావు. తన జీవితం,వ్యక్తిగతం,కుటుంబం. అతను రాసారు అమ్మను చూడాలని అమ్మచేతి వంటతో కడుపు నిండా తినాలి అని. ఎంత చిన్న మనసు,ఎంత చిన్న వయసు నిజమే ఎందుకంటే ఇంకా అతను అమ్మ పెంపకంలోనే ఉన్నాడు.అంటే జీవితంలో కొంతే చూసాడుగా.
మరి తనను అంత ప్రేమగా చూసుకున్న అమ్మకు,చెల్లికు అతను ఏం చేసాడు.మిగిలిన తన కొంత జీవితాన్ని అమ్మకోసం చెల్లి కోసం సాయపడుతూ బ్రతకాలిగా.అమ్మ చేతి ముద్దతో కడుపారా తిన్న ఆ కొడుకు అమ్మ ప్రేమను చూసాడు. మరి ఆ అమ్మకు కొడుకు చేతి ముద్దతో కడుపారా తినిపించి కన్నప్రేమను చూపించ లేక పోయాడు. తను అన్నాడు తెలంగాణా కోసం ఉద్యమంలో ఓ బిందువునైతానని.కానీ ఆ తల్లి చేల్లిలను మాత్రం శోక సంద్రంలో ముంచి పోయాడు. తనను తాను చంపుకున్నవాడు పోరాటంలో బిందువు కాదు కదా ఒక పరమాణువు కూడా కాలేడు అని నా ఉద్దేశ్యం.
మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతోమంది "నాయకులు" తమ ప్రాణాలను అర్పించారు.గమనించాలి అప్పుడు ప్రాణాలు అర్పించింది సామాన్యప్రజలు కాదు నాయకులు.వాళ్ళు కూడా ఎవరూ అత్మహత్యకు పాల్పడలేదు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారే అందుకే వారు వీరులు,చరిత్రకారులు అయ్యారు.అదే వారు ఆ రోజు మనలాగే ఏ అగాయిత్యానికో పాల్పడితే వారు (ఆంగ్లేయులు) మనల్ని హీనులుగా, పిరికివాళ్ళగా చూసేవారు.మనము ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు.వారికీ భానిసలుగా బ్రతుకులు ఈడ్చే వాళ్ళం.మనం నిర్మించిన సర్కారుకు భయపడి మనం తనువు చాలించి సాధించింది ఏం లేదు కాబట్టి ముందుగా మనల్ని నమ్ముకున్న వారిని,నమ్మివచ్చినవారిని సంతోషంగా ఉంచుదాం.తరువాత సమాజంలో మన వంతు పాత్ర పోషిద్దాం.అంతేకాని క్షణికావేశాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
ఒక చావుతో ప్రభుత్వం తన మనసు మార్చుకుంటుంది అనుకుంటే దానికి ముందుగా మనం నిలబెట్టిన క్షమించాలి మన కోసం నిలబడిన ప్రజా నాయకులు ఉన్నారు.అంతేకాని మనం తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయాలు ఈ ప్రభుత్వం దగ్గర ఎందుకు పనికిరావు.ఆ రోజు దీనపత్రికలో చిన్న శిర్షీకలా మిగిలిపోతాం.ఎక్కడో నలిగిపోతాం లేకపోతే చిరిగిపోతాం అంతే.పోరాడు పోరాటంలోనే అవసరమైతే ప్రాణాలను అర్పించి చరిత్రకారుడుగా మిగిలిపో అంతేకానీ తొందరపాటు నిర్ణయాలతో పిరికివాడిగా మిగిలిపోకు.చివరిగా అతని ఆత్మకు శాంతి చేకూరాలని,అమ్మకు,చెల్లికు అతని లోటు తప్పా అన్ని చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తూ ...........................
మీ
చిలిపి చిన్నోడు
Wednesday 20 July 2011
ఆ రోజు నాకు ఆనందమే
నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.
ఆ రోజు నేను ఇంకా పడుకోనే ఉన్నాను. మెలుకువ రాలేదు ఏదో చప్పుడు అనిపించింది ఎవరో మాట్లాడుకుంటున్నారు. లేచి చూసాను.ఎక్కడ ఉన్నానో అర్ధం కాలేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాళ్ళను నేను ఎప్పుడో చూసాను.అరే వాళ్ళు మావాళ్ళే .వాళ్ళు నన్ను గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది.వాళ్ళను నేను కలుసుకున్నందుకు.అదే విషయం అమ్మానాన్నలకు స్నేహితులకు వీళ్ళ బందువలకు చెబుదామని వాళ్ళను విడిపించుకొని వచ్చేసాను.
ఊర్లో ఎవరి పనుల్లో వారు ఉన్నారు.ఇంకా మా ఇల్లు రావడానికి చాలా దూరం ఉంది. నేను ఎవరిని పలకరించినా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు వాళ్లకు ఈరోజు చాలా తీరిక లేని పనులున్నాయని అనుకున్నాను.పిల్లలు బడికి వెళ్ళడానికి మారం చేస్తున్నారు. నేను వాళ్ళను బుజ్జగించి పంపిద్దమనుకున్నాను.కానీ ముందు నా ఆనందాన్ని అమ్మానాన్నలతో చెప్పాలి స్నేహితులతో పంచుకోవాలి. వారి వారి బందువులకు తెలియజేయాలి. అందుకే తొందరగా నడవ సాగాను.
మా ఇల్లు దగ్గర పడింది.కానీ ఇంటి దగ్గర ఎక్కువగా మనుషులు ఉన్నారు.నేను అనుకున్నాను వాళ్ళు నాకంటే ముందే ఇంటికి వచ్చేసరేమోనని లేదంటే నా కంటే ముందే ఈ విషయం మా వాళ్లకి తెలిసి పోయిందని.ఛ ఇంకా వేగంగా నడవ వలసింది.నా స్నేహితులంతా ఒక దగ్గరకు చేరి ఉన్నారు.పట్టణంలో ఉంటున్న స్నేహితుడు ఒకడు అప్పుడే వచ్చి వాళ్ళ చెవిలో ఏదో చెప్పాడు వాళ్ళు దానికి మౌనం గానే తల ఊపారు నాకు ఆశ్చర్యమేసింది వాళ్ళు మౌనంగా ఉండడం.వీళ్ళు ఎక్కడ ఉంటె అక్కడ రచ్చరచ్చ చేసే వీళ్ళా అలా ఉన్నారు అనుకున్నాను.వచ్చిన పెద్దవారి ముందు గౌరవమేమో అనుకున్నా.
వాళ్ళను పిలిచాను వారు పలకలేదు. నాకు కోపం వచ్చింది.అందుకే అమ్మనే కలుసుకుందామని తిన్నగా ఇంట్లోకి వెళ్లాను. అక్కడ ఇంతకుముందు నేను చూసిన పెద్దవారు ఎవరులేరు. లోపలికి వెళ్ళాను. అమ్మ ఏడుస్తోంది. అరే ఏంటి అమ్మ ఏడుస్తోంది?.ఒదార్చుదామని అమ్మను పట్టుకున్నా అమ్మకు చలనం లేదు.ఎదురుగా చూసాను అందమైన పూల వరుసలో నా ప్రతిబింబం అప్పుడే తెలిసింది నాకు నేను చనిపోయానని.
అయ్యో ఎంత పనిచేసాను. నన్ను నేను తిట్టు కున్నాను.ఏడ్చాను. నన్నునమ్ముకున్నవారిని నన్ను నమ్మి వచ్చిన వారిని విడిచిపెట్టిపోయినందుకు చాలా బాధ పడ్డాను.వారి కంటే ఎక్కువగానే ఏడ్చాను.కానీ నాకు చాలా ఆనందమేసింది.వారి కంటే ముందు వెళ్లిపోయినందుకు.ఎందుకంటే వారి చావును నేను సహించలేను చూడలేను.
తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు
నా పోస్ట్ వాయిస్ లో వినాలి అనుకుంటే ప్లే బటన్ నొక్కండి.
తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు అయితే మరి మన పెద్దలు ఏం చేసారు. మనకు ఏం చెప్పారు. అసలు పెద్ద వారు అంటే ఏవరు?
.నేను ఇంకా చిన్న పిల్లవాడినే. ఎందుకంటారా నేను ఇంకా నేర్చుకునే ఉంటున్నాను. మరి నేర్చుకున్న ప్రతి వాడు చిన్న వాడు ఐతే ప్రతి మనిషి చిన్న వాడే ఎందుకంటే ఎవ్వరికి అన్ని విషయాలు తెలియవు. మరి పెద్ద వాళ్ళు ఏవరు?[వయస్సు కాదు ఇక్కడ ముఖ్యం ]. మరి అన్ని తెలుసు అనుకున్నవారా? కాదు ఎందుకంటే తనకు ఏమి తెలియదన్న విషయం తనకు తెలుసు. మరి ఏవరు పెద్ద ?మనకంటే ఎక్కువ తెలిసిన వాడు మనకంటే పెద్ద.
అయితే గాంధీ,నెహ్రు,వివేకానందుడు మొదలగు వారు మన కంటే క్షమించాలి నా కంటే పెద్దవారు. ఎందుకంటే నాకంటే వాళ్ళకు ఎక్కువగా తెలుసు. ఐతే వాళ్ళు ఏం చెప్పారు ఉన్న దానితో తృప్తి పదండి. అన్నారు తృప్తి చెందిన వారు ఐతే ఇ ఉద్యోగాలు, పోరాటాలు ఎందుకు హాయిగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చుగా దొరికితే తింటూ లేక పొతే దొరకలేదని తృప్తి పడుతూ మరి ఎందుకు ఇ చదువులు ప్రయాణాలు ఆపేద్దాం ఏమంటారు.
[ఇదంతా ఎందుకు రాసానంటే నేను బస్సులో వెళ్తూ ఉంటె వేరే సీట్లో కూర్చున్న నేను ఏదో కక్కుర్తితో లేచి వెళ్లి విండో సీట్లో కూర్చున్న అందుకు ప్రక్కనున్న ఆయనా నన్ను ఎరా బాబు ఎందుకు అలా సీట్లు మారుతావు ఉన్న దానితో తృప్తి పడకుండా అని అన్నాడు. అందుకు నేను బదులుగా పై మాటలు అన్నాను. తప్పుగా అంటే మీరేక్షమించండి. ఎందుకంటే ఇంకా నేను మీ చిలిపి చిన్నోడినే కదా]
"తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు" నిజమే మరి తృప్తి అంటే ఏమిటి?నాకు తెలిసినంత వరకు ఇది మనకు రాదు ఇంకా జరగదు అని అనిపిస్తేనే రాజీ పడతాం అదే తృప్తి. అలాంటప్పుడే తృప్తి పడాలి.అప్పుడే మన మనసుకి ఆనందం ఆరోగ్యం , అవకాసం ఉంటె సాదించాలి.
" శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది."
Location:
Garividi, Andhra Pradesh, India
Tuesday 19 July 2011
అచ్చం మా పాపలాగే
ఉదయం బోజనం చేసి నేను బయటకు వెళ్తున్నాను పాప ఆడుకుంటుంది . రైతులు వారి వారి పనులుకు వెళ్తున్నారు సంక్రాంతి సమయం కావడంతో వీధి రోడ్లు రంగులతో ముస్తాబు గా ఉన్నాయి.వాటిపై నడిస్తే కొడతారేమో అన్నంత అందంగా ఉన్నాయి ఆ ముగ్గులు.అందుకే అక్కడే నిలబడిపోయాను. నాన్న తన పనులు తను చూసుకుంటున్నాడు.నన్ను పట్నం వెళ్లి పంటకు కావలసిన ఎరువులు, సామాన్లు తెమ్మన్నాడు.వెళ్ళాను అక్కడ పనులు ముగించుకొని వస్తున్నాను.సూర్యుడు మండుతున్నాడు ఎండ తీవ్రత బాగా పెరిగింది సూర్యుడ్ని చూడలేకపోతున్నాం ఏడుపులో మా పాపలా కోపంలో వాళ్ళ అమ్మలా .
ఇంటికి చేరుకున్నాను నా బంగారు కొండలు నా గురించి ఎదురు చూస్తున్నారు.రాగానే పాప నన్ను అల్లుకుంది వాళ్ళమ్మ నా చేతిలో సామాన్లు తీసుకోని వాటిని భద్రపరిచింది. కాస్త అలసట తీర్చుకొని భోజనం కానిచ్చి పాపతో ఆడుకుంటూ అలా నిద్రలోకి జారు కున్నాను పాప నా గుండెలపై ఆడుకుంటూ తను పడుకుంది. సాయంత్రం అయింది నేను లేచేసరికి. ఎప్పుడు లేచిందో పాప మౌనంగా ఉంది వాళ్ళమ్మ బుజ్జగిస్తూ బ్రతిమిలాడుతుంది నాకు అర్ధమైంది పాప అలిగిందని.అలా బయటకు వచ్చాను రవి అస్తమిస్తున్నాడు.చాలా జాలిగా కనిపించాడు. మారంలో మా పాపలా బుజ్జగింపులో వాళ్ళమ్మలా.
ఉదయం వెళ్ళిన రైతులు తమ పనులు ముగించుకొని తిరిగి వాళ్ళ ఇళ్ళకు వస్తున్నారు. నాన్న ఏదో పని మీద పిలిచాడు తనతో వెళ్లాను తిరిగి రాత్రైంది వచ్చేసరికి.అంతా ప్రసాంతంగా ఉంది ఇంటికి చేరుకున్నాం. పాప గురుంచి వాళ్ళమ్మను అడిగాను ఇప్పుడే పడుకుంది అనిచెప్పింది.రాత్రి భోజనం కానిచ్చి ఆరుబయట మంచంపై ఉన్న పాప దగ్గరకు వెళ్ళాను తను నిద్రపోతుంది.నేను పక్కనే పడుకొని ఆకాశం వైపు చూసాను చందమామ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నిద్రలోని మాపాపలా ప్రేమలో వాళ్ళ అమ్మలా.
Labels:
ప్రేమ
Location:
Cheepurupalli, Andhra Pradesh, India
Monday 11 July 2011
రక్షా - శిక్షా
మొన్ననే పేపర్లో చదివాను. జంతువును చంపినందుకు వ్యక్తీ కి జైలు శిక్షా అని. అప్పుడు అనుకున్నాను మన ప్రభుత్వం చాల గొప్పది ఎందుకంటే మన సమస్యలే పట్టించుకోని సరైన సమాధానాలు లేని మన ప్రభుత్వం నోరు లేని మూగజీవాల బాధలను వాటి ప్రాణ విలువలను తెలుసుకొని అలాంటి రాక్షషులను శిక్సిస్తున్నారని ఇంకా అంతరించిపోతున్న కొన్ని జంతు జాతులను కాపాడుతున్నారని తెలిసి చాలా ఆనంద పడ్డాను. కానీ.......... చాలు మనుషులుగా ఈ పని చేసినందుకు కొంచెం సిగ్గు పడదాం.
సిగ్గు పడదాం అని ఎందుకన్నానంటే నిన్న నేను "జూ" కు వెళ్లాను. అది జూ కాదు ఒక జంతుజైలు పాపం ఎ తప్పు చేయని అమాయక నిర్దోషులు అవి. "మేము ఎ తప్పు చయలేదు మమ్మల్ని విదిచిపెట్టేయండి బాబూ" అని లోపల అరుస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటె బయట మనం ఆనంద పడిపోతున్నాం. వాడెవడో ఒక జంతువును ఒక్క క్షణంలో ఎ హింసా పెట్టకుండా చంపేసాడు. పాపం వాడికి జైలు శిక్షా ఎందుకంటే బోనులో ఉండవలసిన దాన్ని చంపాడుగా అందుకే వాడికి జైలు శిక్స. o.k అతను తప్పు చేసాడు శిక్స వేసారు. మరి ఎ తప్పు చేయని అ అమాయక మూగజీవాలకు తమ స్వేచ్చను,ఆనందాలను,కోర్కెలను,బంధించి ఉంచేసారే మరి ఈ అధికారులకి ఏ శిక్స వేయాలి?. అసలు వాటిపై ఈ అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు?.
ఇచ్చింది ఎవరో కాదు మనమే. ఐతే వాళ్ళ అధికారాన్ని మనుషులపై చూపించమనండి. వాటిని అడిగారా? అవి వాళ్ళకు పదవులునిచ్చాయా? మరి ఎందుకు వాటిపై ఈ అధికారం. ఐనా వాటిని ఎందుకు జూ లో ఉంచాలి వాటిని చూడకపోతే మనుషులు చనిపోతారా?. మన ఆనందాల కోసం వాటిని బందిచాలా? అలా కాదు గాని మనుషులు కొందరిని అడవికి తీసికెళ్ళి "మనిషి ప్రదర్సన శాల" అని పెట్టాలి. అడవి లో జంతువులు చూస్తూ ఉంటే లోపల మనిషి వదలండి అని బుర్రకోట్టుకుంటూ జుట్టు పీక్కుంటుంటే ఎ కోతో బయట నుండి మనల్ని చూసి గెంతుతుంది అప్పుడు తెలుస్తోంది. అది జూ లో గేంతుతుందో బాధతో అరుస్తుందో అని.
అంతరిచిపోయిన జంతు జాతిని కాపాడడం ఎందుకు చచ్చి సుఖంగా ఉండవలసిన వాటిని బ్రతికించి హింషించడానికా ఐన ఇలా జూ లో జంతువులను పెట్టేస్తే జాతి అంతరించాకా అభివృద్ధి చెందుతుందా?.
స్వేచ్చనివ్వండి వాటి బ్రతుకు వాటిని బ్రతకనియ్యండి వాటి స్థలం [అడవి]ను కాపాడండి.
చివరిలో వస్తుండగా చెట్టును చూసి నవ్వుకున్నాను ఎందుకంటే అది నడవలేదుగా లేకపోతే దానికి బోను బిగించేవారేమో.
సిగ్గు పడదాం అని ఎందుకన్నానంటే నిన్న నేను "జూ" కు వెళ్లాను. అది జూ కాదు ఒక జంతుజైలు పాపం ఎ తప్పు చేయని అమాయక నిర్దోషులు అవి. "మేము ఎ తప్పు చయలేదు మమ్మల్ని విదిచిపెట్టేయండి బాబూ" అని లోపల అరుస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటె బయట మనం ఆనంద పడిపోతున్నాం. వాడెవడో ఒక జంతువును ఒక్క క్షణంలో ఎ హింసా పెట్టకుండా చంపేసాడు. పాపం వాడికి జైలు శిక్షా ఎందుకంటే బోనులో ఉండవలసిన దాన్ని చంపాడుగా అందుకే వాడికి జైలు శిక్స. o.k అతను తప్పు చేసాడు శిక్స వేసారు. మరి ఎ తప్పు చేయని అ అమాయక మూగజీవాలకు తమ స్వేచ్చను,ఆనందాలను,కోర్కెలను,బంధించి ఉంచేసారే మరి ఈ అధికారులకి ఏ శిక్స వేయాలి?. అసలు వాటిపై ఈ అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు?.
ఇచ్చింది ఎవరో కాదు మనమే. ఐతే వాళ్ళ అధికారాన్ని మనుషులపై చూపించమనండి. వాటిని అడిగారా? అవి వాళ్ళకు పదవులునిచ్చాయా? మరి ఎందుకు వాటిపై ఈ అధికారం. ఐనా వాటిని ఎందుకు జూ లో ఉంచాలి వాటిని చూడకపోతే మనుషులు చనిపోతారా?. మన ఆనందాల కోసం వాటిని బందిచాలా? అలా కాదు గాని మనుషులు కొందరిని అడవికి తీసికెళ్ళి "మనిషి ప్రదర్సన శాల" అని పెట్టాలి. అడవి లో జంతువులు చూస్తూ ఉంటే లోపల మనిషి వదలండి అని బుర్రకోట్టుకుంటూ జుట్టు పీక్కుంటుంటే ఎ కోతో బయట నుండి మనల్ని చూసి గెంతుతుంది అప్పుడు తెలుస్తోంది. అది జూ లో గేంతుతుందో బాధతో అరుస్తుందో అని.
అంతరిచిపోయిన జంతు జాతిని కాపాడడం ఎందుకు చచ్చి సుఖంగా ఉండవలసిన వాటిని బ్రతికించి హింషించడానికా ఐన ఇలా జూ లో జంతువులను పెట్టేస్తే జాతి అంతరించాకా అభివృద్ధి చెందుతుందా?.
స్వేచ్చనివ్వండి వాటి బ్రతుకు వాటిని బ్రతకనియ్యండి వాటి స్థలం [అడవి]ను కాపాడండి.
చివరిలో వస్తుండగా చెట్టును చూసి నవ్వుకున్నాను ఎందుకంటే అది నడవలేదుగా లేకపోతే దానికి బోను బిగించేవారేమో.
Subscribe to:
Posts (Atom)